చండీగఢ్ : ఇండో-పాక్ సరిహద్దుల్లోని బోర్డర్ ఔట్ పోస్ట్ (BOP) డాక్ వద్ద పాక్ ప్రయత్నాలను భారత దళాలు తిప్పికొట్టాయి. మంగళవారం రాత్రి గంటలకు సరిహద్దులో దట్టమైన పొగమంచులో బీఎస్ఎఫ్ జవాన్లు గస్తీ నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో డ్రోన్ శబ్ధం వినిపించింది. దీంతో అప్రమత్తమైన బలగాలు కాల్పులు జరిపారు. ఈ క్రమంలో పాక్ సరిహద్దుల్లో కూలిపోయింది. ఆ తర్వాత డ్రోన్ను పాక్ రేంజర్లు డ్రోన్ను తీసుకెళ్లారు. డ్రోన్ చొరబాటుపై వెంటనే పోలీసులకు, ఇతర ఏజెన్సీలకు సమాచారం అందించినట్లు బీఎస్ఎఫ్ అధికార ప్రతినిధి పేర్కొన్నారు. ఆ తర్వాత బీఎస్ఎఫ్, పోలీసులు డావోకే గ్రామాన్ని చుట్టుముట్టి బుధవారం తనిఖీలు నిర్వహించారు. సోదాల్లో భరోపాల్ గ్రామ సమీపంలో ఓ పొలంలో పసుపురంగు టేపు చుట్టిన ప్యాకెట్ కనిపించింది. దాంట్లో 4.3 కిలోల హెరాయిన్ను స్వాధీనం చేసుకున్నారు. సాయంత్రం వరకు సెర్చ్ ఆపరేషన్ నిర్వహించినా హెరాయిన్ తప్పా మరే వస్తువులు దొరకలేదని అధికార వర్గాలు తెలిపాయి.