తార్న్ తరన్: పంజాబ్లోని తార్న్ తరన్ జిల్లాలో పాకిస్థాన్ డ్రోన్ కలకలం సృష్టించింది. జిల్లాలోని లఖానా గ్రామంలో భద్రతా దళాలు ఆ డ్రోన్ను నేలకూల్చాయి. భారత గగనతలంలో ప్రవేశించిన ఆ పాకిస్థానీ డ్రోన్ (DJI మ్యాట్రిస్ 300 RTK) ను బీఎస్ఎఫ్ (BSF) బలగాలు పేల్చివేశాయి. ఈ విషయాన్ని బీఎస్ఎఫ్ (సరిహద్దు భద్రతా దళం) స్వయంగా ప్రకటించింది.
గురువారం రాత్రి పాకిస్థాన్ వైపు నుంచి భారత సరిహద్దుల్లోకి డ్రోన్ రావడం గమనించిన బీఎస్ఎఫ్ జవాన్లు.. రాత్రి 9.12 గంటలకు దాన్ని కూల్చేశారు. అనంతరం బీఎస్ఎఫ్ జవాన్లు, పంజాబ్ పోలీసులు సంయుక్తంగా సెర్చింగ్ ఆపరేషన్ చేపట్టి.. ఇవాళ ఉదయం 8.10 గంటలకు డ్రోన్ శకలాలను గుర్తించారు.
కాగా, ఈ నెల 22న ఫజిల్కా ప్రాంతంలో కూడా భద్రత దళాలు ఓ డ్రోన్ను మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నాయి. పక్కా సమాచారంతో ఫజిల్కా జిల్లాలోని జోధావాలా గ్రామం సరిహద్దుల్లో రెండు కిలోల హెరాయిన్, ఓ పాకిస్థానీ డ్రోన్ ను స్వాధీనం చేసుకున్నారు.