న్యూఢిల్లీ, జూలై 2: జమ్ములోని ఎయిర్బేస్ తరహా దాడులను డీఆర్డీవో అభివృద్ధి చేసిన కౌంటర్ డ్రోన్ టెక్నాలజీ నిరోధిస్తుందని సంస్థ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ సిస్టమ్స్(ఈసీఎస్) డైరెక్టర్ జనరల్ జిల్లెలమూడి మంజుల చెప్పారు. డ్రోన్ దాడులను అడ్డుకొనేందుకు డీఆర్డీవో డీ-4 అనే యాంటి డ్రోన్ వ్యవస్థను అభివృద్ధి చేసింది. ఇది శత్రు డ్రోన్లు నాలుగు కిలోమీటర్ల దూరం ఉన్నప్పుడే గుర్తించి ధ్వసం చేస్తుంది.