న్యూ ఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీ సహా ఉత్తరాది రాష్ట్రాలకు చలి, పొగమంచు నుంచి కాస్త ఉపశమనం లభించింది. ఈ ఉదయం మేఘావృతమైన వాతావరణం, తేలికపాటి వర్షం కారణంగా ఆయా ప్రాంతాల్లో పొగమంచు తగ్గడంతో విజిబిలిటీ మెరుగుపడినట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. పంజాబ్, హర్యానా, ఢిల్లీ, రాజస్థాన్, పశ్చిమ ఉత్తరప్రదేశ్ సహా ఉత్తర భారత్లో పరిస్థితులు కాస్త మెరుగుపడినట్లు పేర్కొంది.
గురువారం రాజధానిలో కనిష్ట ఉష్ణోగ్రత 9 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. సఫ్దర్జంగ్ ప్రాంతంలో ఉదయం 8.30 గంటల వరకు కనిష్ట ఉష్ణోగ్రత 9.3 డిగ్రీలు కాగా, పాలంలో కనిష్ట ఉష్ణోగ్రత 9.6 డిగ్రీల సెల్సియస్గా నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. గురువారం ఉదయం ఢిల్లీలో గాలి నాణ్యత 312గా నమోదైనట్లు ఐఎమ్డీ వెల్లడించింది. కాగా, మరో రెండు రోజుల పాటు ఉత్తర భారతదేశంలో చిరుజల్లులు కురిసే అవకాశం ఉందని తెలిపింది. దీంతోపాటు చలి, పొగమంచు పరిస్థితులు కొనసాగే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది.
Delhi | Smog engulfs Delhi, air quality is in "very poor" category with an overall AQI of 312.
(Top 2 pics- Lodhi road, bottom 2 pics – India Gate) pic.twitter.com/KFlu6q6xjZ
— ANI (@ANI) January 12, 2023