ముంబై: ముంబైలో ఎయిర్పోర్టులో అక్రమంగా తరలిస్తున్న (Smuggling) ఐ పోన్లు భారీగా పట్టుబడ్డాయి. హాంకాంగ్ నుంచి ఢిల్లీ వచ్చిన ఓ పార్శిల్ను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అధికారులు తనిఖీ చేశారు. అందులో భారీగా ఖరీదైన ఐ ఫోన్లు ఉండటంతో వాటిని సీజ్ చేశారు. పార్శిల్లో మొత్తం 3646 ఐ ఫోన్లు ఉన్నాయని, వాటి విలు రూ.42.86 కోట్లు ఉంటుందని చెప్పారు.
ఇందులో ఐ ఫోన్ 13 ప్రో మోడల్కు చెందిన 2,245 ఫోన్లు, ఐ ఫోన్ 13 ప్రో మ్యాక్స్ హ్యాండ్సెట్లు 1401, గూగుల్ పిక్సల్ 6 ప్రో హ్యాండ్సెట్లు 12, ఆపిల్ స్మార్ట్ వాచ్ ఒకటి ఉన్నాయని వెల్లడించారు. మెమరీ కార్డుల ముసుగులో ఐ ఫోన్లు తరలిస్తున్నారని ( Smuggling ) చెప్పారు. పార్శిల్పై ఉన్న చిరునామా ఆధారంగా నిందితుడిపై కేసు నమోదుచేశామని, దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.