హైపర్ సోనిక్ క్షిపణి పరీక్ష విజయవంతమైంది. ఒడిశా తీరంలోని ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపం నుంచి డీఆర్డీవో ఈ క్షిపణిని ఆదివారం ఉదయం విజయవంతంగా పరీక్షించింది. ఇది 1500 కిలోమీటర్లకు మించిన వివిధ పే లోడ్లను సునాయాసంగా లక్ష్యానికి తీసుకెళ్లగలదు. ఈ విషయాన్ని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రకటించారు.
దీర్ఘ శ్రేణి హైపర్ సోనిక్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించడంతో భారత్ ఓ పెద్ద మైలు రాయిని దాటిందని రాజ్నాథ్ సింగ్ తెలిపారు. ఈ చారిత్రక ఘట్టంతో అత్యాధునిక మిలటరీ టెక్నాలజీని సాధించిన అతి కొద్ది దేశౠల జాబితాలో భారత్ కూడా చేరినట్లయ్యిందని వెల్లడించారు. ఈ మేరకు హైపర్ సోనిక్ క్షిపణి పరీక్షకు సంబంధించిన వీడియోను తన ట్విట్టర్ (ఎక్స్) ఖాతాలో పోస్టు చేశారు.