న్యూఢిల్లీ, మార్చి 25 : రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) అభివృద్ధి చేసిన దీర్ఘశ్రేణి గగనతల రక్షణ వ్యవస్థ ‘ప్రాజెక్టు కుశ’ తొలి అభివృద్ధి పరీక్షలను భారతదేశం విజయవంతంగా పూర్తి చేసింది. ఈ వ్యవస్థను మూడు అంచెల ఇంటర్సెప్టర్ క్షిపణి అమరికతో రూపొందించారు.
ఇది 150 కి.మీ నుంచి 450 కి.మీ లక్ష్యాలను ఛేదించగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఫైటరు జెట్లు, డ్రోన్లు, బాలిస్టిక్ క్షిపణులు లాంటి విస్తృత శ్రేణి వైమానిక ముప్పులను ఎదుర్కోవడమే లక్ష్యంగా దీనిని రూపొందించారు.