ముంబై, మే 5: దేశ భద్రతకు సంబంధించిన రహస్య సమాచారాన్ని బహిర్గతం చేశారనే ఆరోపణలపై రెండు రోజుల క్రితం అరస్టైన డీఆర్డీవో శాస్త్రవేత్త ప్రదీప్ ఎం కురుల్కర్(59) విచారణలో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది.
ఓ మహిళా ఏజెంట్ ద్వారా పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ విసిరిన వలపువలకు పుణెలోని డీఆర్డీవో కేంద్రంలో ల్యాబ్ డైరెక్టర్గా పని చేసే ఈ శాస్త్రవేత్త చిక్కినట్టు మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్కాడ్(ఏటీఎస్) గుర్తించింది.