బెంగళూరు, జూలై 1: భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) అభివృద్ధి చేసిన మానవ రహిత విమాన పరీక్ష విజయవంతమైంది. శుక్రవారం కర్ణాటకలోని చిత్రదుర్గలో ఈ విమానాన్ని తొలిసారి పరీక్షించారు. విమానం బయలుదేరినప్పటి నుంచి వే పాయింట్ నావిగేషన్, తిరిగి గమ్యం చేరుకొనేవరకు కచ్చితమైన పనితీరును ప్రదర్శించిందని డీఆర్డీవో ఒక ప్రకటనలో పేర్కొన్నది. మానవ రహిత విమానాల అభివృద్ధికి ఈ పరీక్ష గొప్ప మైలురాయి అని వెల్లడించింది. వ్యూహాత్మక రక్షణ సాంకేతిక పరిజ్ఞానంలో స్వయం సమృద్ధి సాధించే దిశగా కీలక అడుగు పడిందని తెలిపింది.
మానవ రహిత విమాన ప్రత్యేకతలు:
డీఆర్డీవోకు చెందిన ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్(ఏడీఈ)-బెంగళూరు దీన్ని అభివృద్ధి చేసింది.
ఇది చిన్న టర్బోఫ్యాన్ ఇంజిన్ సహాయంతో పనిచేస్తుంది.
ఇందులోని మొత్తం వ్యవస్థను దేశీయంగానే తయారుచేశారు. ఏవియోనిక్స్ వ్యవస్థ, విమాన నియంత్రిత వ్యవస్థ, ఎయిర్ ఫ్రేమ్, అండర్ క్యారేజ్ను భారత్లోనే
తయారుచేశారు.