వెంట ప్రధాని, కేంద్ర మంత్రులు
న్యూఢిల్లీ, జూన్ 24: రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థిగా పోటీచేస్తున్న ద్రౌపది ముర్ము శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర మంత్రుల సమక్షంలో పార్లమెంట్ భవనంలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. మొత్తం నాలుగు సెట్ల నామినేషన్ పత్రాలను దాఖలు చేయగా.. వాటిపై 500 మందికిపైగా ప్రజాప్రతినిధులు సంతకాలు చేశారు.
ముర్ముకు వైసీపీ కూడా మద్దతు తెలిపింది. విపక్షాల అభ్యర్థిగా బరిలో దిగిన యశ్వంత్ సిన్హా 27న నామినేషన్ వేయనున్నారు. వచ్చే నెల 18న రాష్ట్రపతి ఎన్నికలు జరుగనున్నాయి. 21న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. 25న నూతన రాష్ట్రపతి ప్రమాణస్వీకారం చేస్తారు.