ప్రసార భారతి యూట్యూబ్ ఛానళ్లు, దూరదర్శరన్కు ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ పెరిగింది. దాయది పాకిస్తాన్లో కూడా దూరదర్శన్కు ఆదరణ పెరిగింది. ఈ విషయాన్ని కేంద్ర ప్రసార మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. యూఎస్, సౌదీ, బంగ్లాదేశ్, అరబ్ ఏమిరెట్స్, పాకిస్తాన్ ఈ దేశాల్లో ప్రసార భారతి యూట్యూబ్ ఛానళ్ల ఆదరణ పెరిగిందని పేర్కొన్నారు. ఈ ఆదరణ అంతా కేవలం మూడేళ్లలోనే పెరిగిందని కూడా మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇక మొన్నటి వరకూ మన దేశంపై కత్తి దూసిన నేపాల్లో కూడా కరోనా సమయంలో ప్రసార భారతి యూట్యూబ్ ఛానళ్ల ఇమేజ్ పెరిగింది. పాకిస్తాన్లో 2018 లో 64 లక్షలకు పైగా వ్యూస్ వస్తే, 2020 నవంబర్ మాసాంతం నాటికి 1.33 లక్షల వ్యూస్ వచ్చినట్లు పేర్కొన్నారు. ఇక… యూఎస్లో 2018 నాటికి ఆలిండియా రేడియో, దూరదర్శన్ను 52.26 మంది వీక్షించారని, 2020 నాటికి 1.28 లక్షల మంది వీక్షించారని కేంద్రం పేర్కొంది.