న్యూఢిల్లీ : కొవిడ్-19 వ్యాక్సినేషన్ను ప్రభుత్వం వేగవంతం చేసింది. ఇంటింటికీ టీకా కార్యక్రమానికి కేంద్రం అనుమతించిందని నీతి ఆయోగ్ సభ్యులు డాక్టర్ వీకే పాల్ గురువారం తెలిపారు. ఇందుకు సంబంధించి మార్గదర్శకాలనూ ప్రభుత్వం జారీ చేసిందని చెప్పారు. మరోవైపు దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నా మనం వైరస్ సెకండ్ వేవ్ మధ్యలో ఉన్నామని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.
ఇక గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 31,000 తాజా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో అత్యధిక కేసులు కేరళ, మహారాష్ట్రలో వెలుగుచూశాయి. దేశంలో ఆరు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కరోనా వ్యాక్సిన్ తొలి డోసు నూరు శాతం పంపిణీ జరిగిందని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ వెల్లడించారు.