కీవ్ : రష్యా, ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్త వాతావరణ నెలకొన్నది. ఆయా దేశాల సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నెలకొన్నది. ఈ పరిస్థితుల్లో ఉక్రెయిన్లోని భారత రాయబార కార్యాలయంలో భారత్కు తిరిగి రావాలని సూచించింది. దీంతో ఉక్రెయిన్ నుంచి భారత్కు సరిపడా విమానాలు లేకపోవడంతో విద్యార్థులతో పాటు పలువురు ఇక్కట్లకు గురవుతున్నారు. ఈ క్రమంలో భారత ఎంబసీ అక్కడ ఉన్న భారతీయులనుద్దేశించి కీలక ప్రకటన చేసింది.
‘రష్యా ఉక్రెయిన్ మధ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం. ఉక్రెయిన్లోని భారతీయులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. భారత విద్యార్థుల పట్ల అప్రమత్తంగా ఉన్నాం. భారత్ – ఉక్రెయిన్ మధ్య విమాన సర్వీసుల పెంపుపై చర్చలు జరుపుతున్నట్లు’ ప్రకటించింది. ప్రస్తుతం ఉక్రేనియన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్, ఎయిర్ అరేబియా, ఫ్లై దుబాయి, ఖతార్ ఎయిర్ వేస్ విమానాలు నడుపుతున్నాయి.