న్యూఢిల్లీ: ఉన్నత చదువుల కోసం తమ దేశంలో అడుగుపెట్టే భారతీయ విద్యార్థుల్ని వదులుకోబోమని భారత్లోని కెనడా హై కమిషన్ తాజాగా వెల్లడించింది. సరైన అవగాహన లేకుండా ఫేక్ డాక్యుమెంట్స్తో అడుగుపెట్టినప్పటికీ, నిజమైన విద్యార్థులపై చర్యలు ఉండవని కెనడా హై కమిషన్ అధికార ప్రతినిధి సోమవారం న్యూఢిల్లీలో విలేకర్లతో చెప్పారు. అలాంటి వారికి ఐదేండ్ల నిషేధం వర్తించదన్నారు. ఫేక్ అడ్మిషన్ డాక్యుమెంట్స్తో అడుగుపెట్టే విద్యార్థులపై ఐదేండ్ల నిషేధం విధిస్తామని కెనడా బోర్డర్ సర్వీసెస్ ఏజెన్సీ ప్రకటన జారీచేసింది.