Donald Trump : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) తన దూకుడు తగ్గించి భారత్ పట్ల స్నేహహస్తం చాటుతున్నారు. ఈమధ్యే యూరోపియన్ యూనియన్, భారత్ మధ్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం కుదరడంతో కంగుతిన్న ట్రంప్.. వెనక్కి తగ్గారు. సోమవారం ప్రధాని నరేంద్ర మోడీతో మాట్లాడినట్టు పేర్కొన్న అమెరికా అధినేత మోడీ తనకు గొప్ప స్నేహితుడని అన్నారు. అంతేకాదు ఇండియాపై ప్రతీకార టారీఫ్లను 25 శాతం నుంచి 18 శాతానికి తగ్గిస్తున్నాని వెల్లడించారు.
గత కొన్నిరోజులుగా భారత్పై పగబట్టినట్టు ప్రవర్తించిన డొనాల్డ్ ట్రంప్ దారికొచ్చారు. అమెరికాను కాదని రష్యా, యూరోపియన్ యూనియన్తో ద్వైపాక్షిక సంబంధాలు, ఆర్ధిక కార్యకలాపాలపై దృష్టి సారించిన ఇండియాను వదులుకోవద్దని భావించిన ఆయన మనసు మార్చుకున్నారు.
Donald Trump’s latest post on Truth Social. This cover of India Today magazine is giving credit to PM Modi for taking on Trump yet this dumb baboon is sharing it as some achievement 🤦🏻♀️ pic.twitter.com/5Lv2QyN94x
— Monica Verma (@TrulyMonica) February 2, 2026
‘ఈరోజు ఉదయం భారత ప్రధాని మోడీతో మాట్లాడడాన్ని గౌరవంగా భావిస్తున్నా. మోడీ నాకు గొప్ప స్నేహితుడు. భారతదేశంలో శక్తివంతమైన నాయకుడు ఆయన. వాణిజ్యం, ఉక్రెయిన్ – రష్యా యుద్ధాన్ని ముగించడం.. ఇలా మేమిద్దరం చాలా విషయాలు మాట్లాడుకున్నాం. ఈ సందర్భంగా రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు నిలిపివేసేందుకు మోడీ అంగీకరించారు. ఇకపై అమెరికా నుంచి.. వెనెజువెలా నుంచి చమురు కొనుగోలు చేయనున్నారు’ అని ట్రుత్లో ట్రంప్ రాసుకొచ్చారు.