ముంబై: రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాలతో ఉన్న వాహనం కేసు, దాని యజమాని మన్సుఖ్ హిరేన్ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సస్పెండైన ముంబై పోలీస్ అధికారి సచిన్ వాజే ఎన్ఐఏ కస్టడీని కోర్టు ఈ నెల 7 వరకు పొడిగించింది. ఆయన కస్టడీ శనివారంతో ముగియడంతో ఎన్ఐఏ ప్రత్యేక కోర్టులో ప్రవేశపెట్టారు. చట్టవిరుద్ధ కార్యకలాపాల నివారణ చట్టంతోపాటు నమోదైన పలు కేసులపై దర్యాప్తు కోసం సచిన్ వాజే కస్టడీ అవసరమని ఎన్ఐఏ అధికారులు కోర్టుకు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆయన కస్టడీని కోర్టు మరో నాలుగు రోజులు పొడిగించింది.