జైపూర్: గొడవలో ఒక వృద్ధురాలు గాయపడింది. ఆమె రెండు కాళ్లకు ఫ్యాక్చర్ అయ్యింది. కుడి కాలికి ఆపరేషన్ అవసరమని డాక్టర్లు నిర్ధారించారు. అయితే పొరపాటు వల్ల మరో కాలికి సర్జరీ చేశారు. ఈ నేపథ్యంలో నిర్లక్ష్యానికి కారణమైన డాక్టర్పై చర్యలు చేపట్టారు. (doctor operates on wrong leg) రాజస్థాన్లోని జోధ్పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. 66 ఏళ్ల చంపా దేవి ఒక గొడవలో గాయపడింది. దీంతో జోధ్పూర్లోని ఎండీఎం ప్రభుత్వ ఆసుపత్రిలో ఆమెను చేరారు.
కాగా, ఆ వృద్ధురాలికి రెండు కాళ్లు విరిగినట్లు డాక్టర్లు గుర్తించారు. అయితే ఆమె కుడి కాలికి మాత్రమే శస్త్రచికిత్స అవసరమని నిర్ధారించారు. ఏప్రిల్ 27న ఆపరేషన్ నిర్వహించారు. పొరపాటున వృద్ధురాలి ఎడమ కాలికి ఆపరేషన్ చేసినట్లు బయపడింది. దీంతో నిర్లక్ష్యం ఆరోపణలపై విచారణకు ఒక కమిటీని ఏర్పాటు చేశారు.
మరోవైపు తాజాగా ఆ కమిటీ నివేదికను సమర్పించింది. పర్యవేక్షణలో నిర్లక్ష్యమే ఈ పొరపాటుకు కారణమని నిర్ధారించింది. ఈ నేపథ్యంలో ఆర్థోపెడిక్స్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ రామకిషన్ చౌదరిపై చర్యలు చేపట్టారు. ఎండీఎం ఆసుపత్రి బాధ్యతల నుంచి ఆయనను తప్పించారు. తదుపరి నియామక ఉత్తర్వుల కోసం వేచి ఉండేలా జైపూర్లోని వైద్య విద్యా విభాగానికి బదిలీ చేశారు.