న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సినేషన్ విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై కాంగ్రెస్ పార్టీ విమర్శలు గుప్పించింది. దేశ ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి ప్రతిష్ట కోసం కేంద్ర ప్రభుత్వం పాకులాడిందని కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ ఓ ట్వీట్లో ఆరోపించారు. దేశ ప్రజలకు ఇచ్చిన వ్యాక్సిన్ కంటే ఎక్కువ వ్యాక్సిన్ను భారత్ ఎగుమతి చేసిందంటూ ఆమెరికాలో భారత శాశ్వత ప్రతినిధి టీఎస్ తిరుమూర్తి పేర్కొన్న వీడియోను ఆయన తన ట్వీట్కు జోడించారు.
భారతీయుల ప్రాణాలను పణంగా పెట్టి కేంద్రం తప్పుడు ఇమేజ్ కోసం పాకులాడవద్దని విదేశాంగ మంత్రి జైశంకర్ను తాను లోక్సభలో హెచ్చరించినట్టు తివారీ తెలిపారు. కేంద్రం వ్యాక్సిన్ పాలసీపై రాహుల్ సైతం వరుస విమర్శలు గుప్పిస్తున్నారు. ఓవైపు దేశంలో వ్యాక్సిన్ల కొరతతో వ్యాక్సిన్ కేంద్రాలు మూతపడుతుంటే మరోవైపు విదేశాలకు వ్యాక్సిన్ ఎగుమతులేంటని రాహుల్ ప్రశ్నిస్తున్నారు.