న్యూఢిల్లీ: ఓడిపోతామన్న భయంతో ఎన్నికల వేళ దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పే కేంద్ర ప్రభుత్వానికి భయపడే ప్రసక్తే లేదని ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ తేల్చిచెప్పారు. తమ పార్టీ నాయకుడు, ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేందర్ జైన్ను ఈడీ అరెస్టు చేసే ప్లాన్లో ఉన్నదని విశ్వసనీయ సమాచారం అందిందని ఆయ న ఆదివారం వెల్లడించారు. ‘సత్యేందర్ జైన్పై కేంద్ర దర్యాప్తు సంస్థలు ఇంతకుముందు రెండు సార్లు సోదాలు చేశాయి. అయినా ఈ దాడుల్లో వారు గుర్తించింది ఏమీ లేదు! మళ్లీ సోదాలు చేసినా స్వాగతి స్తాం. నాతో పాటు ఎవరినైనా అరెస్టు చేసుకోండి. మేమేం తప్పు చేయలేదు.. భయపడేది లేదు’అని కుండబద్దలు కొట్టారు.