చెన్నై: దివ్యాంగులు ఎప్పుడూ వీల్చైర్లో కూర్చోవాల్సిందేనా? చిన్న చిన్న పనులకూ ఇతరులపై ఆధారపడాల్సిందేనా? అంటే అవసరం లేదని అంటున్నారు ఐఐటీ మద్రాస్ శాస్త్రవేత్తలు. దివ్యాంగులు లేచి నిలబడి చిన్న చిన్న పనులు చేసుకునేందుకు వీలుగా ఎలక్ట్రిక్ స్టాండింగ్ వీల్చైర్ను అభివృద్ధి చేశారు. దీని పేరు ‘నియోస్టాండ్’. మన దేశంలో అభివృద్ధి చేసిన మొదటి స్టాండింగ్ వీల్చైర్ ఇది. దీని ధర రూ.89,990గా నిర్ణయించారు. త్వరలోనే మార్కెట్లోకి రానుంది.