చెన్నై, జూన్ 1: రాజ్యాంగం, సమాఖ్యవాదానికి విరుద్ధంగా కేంద్రం ఢిల్లీ పాలనాధికారాలపై తనదే పెత్తనమని ఆర్డినెన్స్ను తీసుకొచ్చిందని తమిళనాడు సీఎం, డీఎంకే అధినేత స్టాలిన్ విమర్శించారు. ఢిల్లీ సీఎం, అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్మాన్ చెన్నైలో గురువారం స్టాలిన్ను కలిశారు.
తమ పోరాటానికి మద్దతు తెలపాలని కోరారు. దీంతో స్టాలిన్ ఆప్కు అండగా నిలుస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా స్టాలిన్ మాట్లాడుతూ… ఆర్డినెన్స్ను డీఎంకే వ్యతిరేకిస్తుందని, బీజేపీకి వ్యతిరేకంగా ఎన్డీఏయేతర పక్షాలు కలిసి పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.