LokSabha Elections 2024 : రానున్న లోక్సభ ఎన్నికల్లో తమిళనాడులో తమ భాగస్వామ్య పార్టీలు వీసీకే, ఎండీఎంకేతో సీట్ల సర్దుబాటును డీఎంకే ఖరారు చేసింది. లోక్సభ ఎన్నికల్లో తమ పార్టీ రెండు స్ధానాల్లో పోటీ చేస్తుందని వీసీకే ఎంపీ తిరుమలవలవన్ వెల్లడించారు.
వైకో నేతృత్వంలోని ఎండీఎంకే ఒక స్ధానంలో బరిలో నిలుస్తుందని తెలిపారు. ఈ ఒప్పందంపై అన్ని పార్టీలు అంగీకారానికి వచ్చాయని స్పష్టం చేశారు. ఇక 2019 లోక్సభ ఎన్నికల్లో కమ్యూనిస్ట్ పార్టీలు, వీసీకే రెండు స్ధానాలు పొందగా, ఎండీఎంకేకు ఒక స్ధానం దక్కిందని గుర్తుచేశారు.
తమ పార్టీ కర్నాటక, కేరళ, తెలంగాణ రాష్ట్రాల్లోని 15 స్ధానాల్లో పోటీ చేస్తున్నందున తమకు జనరల్ సింబల్ కేటాయించాలని తిరుమలవలవన్ ఈసీకి విజ్ఞప్తి చేశారు. డీఎంకే ప్రధాన కార్యాలయంలో డీఎంకే చీఫ్, సీఎం స్టాలిన్ సమక్షంలో సీట్ల సర్దుబాటు ఒప్పందం ఖరారైందని తిరుమలవలవన్ తెలిపారు.
Read More :
Khammam | ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్పై ఆటో డ్రైవర్ దాడి.. ఖమ్మం జిల్లాలో ఘటన