న్యూఢిల్లీ: డీఎంకే ఎంపీ టీఆర్ బాలు సోమవారం లోక్సభలో కేంద్ర మంత్రి ఎల్ మురుగన్పై చేసిన వ్యాఖ్యలపై డీఎంకే, బీజేపీ మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఒక దళితుడిని అవమానించారని, అందుకు క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్ చేసింది. తమిళనాడుకే చెందిన మంత్రి మురుగన్ స్వరాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకంగా మాట్లాడటంతో డీఎంకే ఎంపీ టీఆర్ బాలు అతనిని ద్రోహి అన్నారు. లోక్సభలో ప్రశ్నోత్తరాల సమయంలో తమిళనాడు వరద సాయంపై ఇరుపక్షాల మధ్య వాగ్వాదం మొదలై.. సభ బయట కూడా కొనసాగింది.