చెన్నై, అక్టోబర్ 5: తమిళనాడులో అరక్కోణంకు చెందిన డీఎంకే ఎంపీ ఎస్ జగత్క్ష్రకన్కు చెందిన నివాసం, కార్యాలయాలపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు గురువారం సోదాలు నిర్వహించారు. వీటిల్లో పలు విద్యాసంస్థలు కూడా ఉన్నాయని అధికారులు తెలిపారు. ఐటీ సోదాలపై సీఎం స్టాలిన్ ధ్వజమెత్తారు.
బీజేపీ ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతున్నదని మండిపడ్డారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను మోదీ సర్కారు దుర్వినియోగం చేస్తున్నదని దుయ్యబట్టారు. ఇండియా కూటమిని నిర్వీర్యం చేసేందుకు ఈ దాడులు నిర్వహిస్తున్నారని మండిపడ్డారు.