చెన్నై : నీట్ నుంచి తమిళనాడుకు మినహాయింపు ఇచ్చే వరకు తమ పోరాటం ఆగదని ఆ రాష్ట్ర సీఎం, డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ తెలిపారు. తన కుమారుడు, మంత్రి ఉదయనిధి స్టాలిన్ నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా నీట్కు వ్యతిరేకంగా నిరాహార దీక్షలు నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. స్టాలిన్ మాట్లాడుతూ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు నీట్ రద్దు కోరుతూ అసెంబ్లీలో బిల్లును ఆమోదించామని తెలిపారు. అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను రాష్ట్రపతికి పంపించడమే గవర్నర్ పని అని, తుది నిర్ణయం రాష్ట్రపతి తీసుకుంటారని పేర్కొన్నారు.