చెన్నై: తమిళనాడులోని అధికారంలో ఉన్న డీఎంకే కార్యకర్తలు పలు బోర్డులపై ఉన్న హిందీ పేర్లకు నల్లరంగు పూస్తున్నారు. రైల్వే స్టేషన్లు, పోస్టాఫీసులు సహా పలు చోట్ల ప్రభుత్వ సైన్ బోర్డులపై హిందీ అక్షరాలను నల్లరంగుతో కనిపించకుండా చేశారు. (DMK blackens Hindi signs) ఆదివారం డీఎంకే కార్యకర్తలు పాలక్కాడ్, పాలైయంకోట్టై రైల్వే స్టేషన్లోని బోర్టులపై హిందీ పేర్లకు బ్లాక్ పెయింట్ వేశారు. సోమవారం కూడా దీనిని కొనసాగించారు. చెన్నైలోని అలందూర్ పోస్టాఫీస్, జీఎస్టీ రోడ్డులోని బీఎస్ఎన్ఎల్ కార్యాలయంలోని సైన్ బోర్డులపై ఉన్న హిందీ అక్షరాలకు నల్లరంగు పూశారు.
కాగా, హిందీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న అధికార డీఎంకేపై బీజేపీ మండిపడింది. తమిళనాడు బీజేపీ చీఫ్ కె అన్నామలై అధికార పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. త్రిభాషా విధానంపై డీఎంకే వైఖరి ‘కపటత్వం’ అని విమర్శించారు. వారి సొంత పిల్లలు బహు భాషా పాఠశాలల్లో చదువుతున్నప్పుడు త్రిభాషా విధానాన్ని డీఎంకే నేతలు ఎందుకు వ్యతిరేకిస్తున్నారని ప్రశ్నించారు. ‘డీఎంకే పార్టీ అనేది వారి కుటుంబాలకు, ఇతరులకు భిన్నమైన ప్రమాణాలు కలిగి గందరగోళంగా ఉన్న అవివేకుల సమూహం. ప్రజలను ఆ పార్టీ తప్పు దారి పట్టిస్తోంది’ అని ఎక్స్లో ఆరోపించారు.
Had seen a few misguided individuals roaming around with a can of black paint, striking Hindi Letters in opposition to the three-language formula in the New National Education Policy. We would humbly suggest that they visit the Enforcement Directorate and Income Tax Office with…
— K.Annamalai (@annamalai_k) February 24, 2025