బెంగళూర్ : శివమొగ్గలో (Shivamogga Incident) ఈద్ ఊరేగింపుపై రాళ్ల దాడి ఘటనపై కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సోమవారం స్పందించారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వారిపై కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఇలాంటి ఘటనలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని, తాము శాంతిని కోరుకుంటామని, అలాంటి ఘటనలను ప్రోత్సహించబోమని డీకే శివకుమార్ స్పష్టం చేశారు.
నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. బెంగళూర్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ శివమొగ్గ ఘటనపై స్పందిస్తూ చట్టాన్ని చేతుల్లోకి తీసుకునేవారిని ప్రభుత్వం ఉపేక్షించదని హెచ్చరించారు.
ఇక అంతకుముందు కర్నాటక సీఎం సిద్ధరామయ్య శివమొగ్గ ఘటనపై వివరణ ఇచ్చారు. ఈ ఘటనకు సంబంధించి 43 మందిని అరెస్ట్ చేసినట్టు వెల్లడించారు. శివమొగ్గలో ప్రస్తుతం పరిస్ధితి అదుపులో ఉందని చెప్పారు. ఘర్షణ నేపధ్యంలో శివమొగ్గ కార్పొరేషన్ పరిధిలో పోలీసులు 144వ సెక్షన్ విధించారు.
Read More :