న్యూయార్క్: వచ్చే ఏడాది నుంచి దీపావళి రోజున అమెరికాలోని న్యూయార్క్లో ఉన్న స్కూళ్లు పబ్లిక్ హాలీడే ఇవ్వనున్నాయి. ఆ నగర మేయర్ ఎరిక్ ఆడమ్స్ దీనిపై ఇటీవల ఓ ప్రకటన చేశారు. దీపాల పండుగ దీపావళి గురించి పిల్లలు నేర్చుకుంటారని, ఇది సమగ్రతా సందేశాన్ని ఇస్తుందని ఆయన అన్నారు. వచ్చే ఏడాది దీపావళి నుంచి ఆ రోజున స్కూళ్లకు సెలువు ఇవ్వాలన్న నిర్ణయాన్ని కలిసికట్టుగా తీసుకున్నట్లు ఆడమ్స్ తెలిపారు. న్యూయార్క్ అసెంబ్లీ సభ్యుడు జెన్నిఫర్ రాజ్కుమార్, న్యూయార్క్ సిటీస్కూల్స్ ఛాన్సలర్ డేవిడ్ బ్యాంక్స్ ఈ నిర్ణయాన్ని స్వాగతించారు. దీపావళి గురించి ఎంతో తెలుసుకున్నానని, ఆ పండుగ ఎందుకు జరుపుకుంటారో తెలిసిందని ఆడమ్స్ చెప్పారు.
భారతీయ అమెరికన్లకు చెందిన ఈ డిమాండ్ ఎంతో కాలం నుంచి పెండింగ్లో ఉందని, దీపావళిని గుర్తించడం అంటే భినత్వాన్ని స్వాగతించడమే అని, భారతీయ సంప్రదాయాల్ని గౌరవిండచమే అవుతుందని న్యూయార్క్ కౌన్సుల్ జనరల్ రణ్దీర్ జైశ్వాల్ తెలిపారు. న్యూయార్క్లో హిందువులు, సిక్కులు, జైనులు సుమారు రెండు లక్షల మంది ఉంటారని, వారంతా ఈ వేడుకను సెలబ్రేట్ చేసుకోవడానికి ఇదో గుర్తింపు అని రాజ్కుమార్ తెలిపారు.