న్యూఢిల్లీ: విడాకులు తీసుకున్న కుమార్తెకు మరణించిన తన తండ్రి సంపదపై హక్కులు ఉండవని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. కేవలం పెళ్లి కానీ కుమార్తెలకు, భర్త మరణించి విడోలుగా ఉన్న కుమార్తెలకు మాత్రమే మరణించిన తండ్రి సంపదను పొందే హక్కు ఉన్నదని కోర్టు తీర్పు చెప్పింది. హిందూ అడాప్షన్ అండ్ మెయింటెనెన్స్ చట్టం ప్రకారం మరణించిన తండ్రి సంపదపై విడాకులు తీసుకున్న కుమార్తెకు హక్కులు ఉండవని వివరించింది.
ఢిల్లీలో భర్త నుంచి విడాకులు తీసుకుని ఒంటరిగా ఉంటున్న ఓ మహిళ మరణించిన తన తండ్రి సంపద నుంచి తనకు నెలనెలా జీవన భృతి ఇప్పించాలని ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. తన పిటిషన్లో తల్లిని, సోదరుడిని ప్రతివాదులుగా పేర్కొంది. ఈ పిటిషన్పై విచారణ జరిపిన న్యాయస్థానం తాజా తీర్పు వెల్లడించింది. అయితే, పిటిషనర్కు తన పుట్టింటి నుంచి కాకుండా మాజీ భర్త నుంచి భరణం కోరే హక్కు ఉన్నదని తెలిపింది.