రాయ్పూర్: ఛత్తీస్గఢ్ కాంగ్రెస్లో ముసలం రాజుకుంటున్నది. సీఎం భూపేశ్ బఘేల్ను మారుస్తారన్న ఊహాగానాల నేపథ్యంలో ఆయనకు సన్నిహితులైన ఆరుగురు ఎమ్మెల్యేలు బుధవారం ఢిల్లీ చేరుకున్నారు. పార్టీ హైకమాండ్ను కలిసే ప్రయత్నాల్లో ఉన్నారు. 2018 డిసెంబర్లో బఘేల్ సీఎం బాధ్యతలు చేపట్టారు. రొటేషన్ ఒప్పందం మేరకు రెండున్నరేళ్ల పాటు ఆయన సీఎంగా ఉండాలి. తర్వాత ఆ పదవిని ప్రస్తుత ఆరోగ్య మంత్రి టీఎస్ సింగ్దేవ్కు ఇవ్వాలి. అయితే పదవిని వదులుకునేందుకు బఘేల్ సిద్ధంగా లేరు. మరోవైపు సీఎం కుర్చీ తప్ప ఇంకేమీ వద్దని సింగ్దేవ్ పట్టుబడుతున్నారు.