లక్నో : అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలుకావడంతో తట్టుకోలేక ఓ అభ్యర్థి ఆత్మాహుతికి యత్నించారు. కాన్పూర్కు చెందిన సీనియర్ నేత ఎస్పీ నేత నరేంద్ర సింగ్ అలియాస్ పింటూ గురువారం నిప్పంటించుకొని ఆత్మాహుతికి యత్నించగా.. అక్కడే ఉన్న పోలీసులు వెంటనే స్పందించి.. దవాఖానకు తరలించారు. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తున్నది. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ పార్టీ అధికారంలోకి రావడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యకు యత్నించారని పోలీసులు పేర్కొన్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాన్పూర్ నగర్కు చెందిన సీనియర్ ఎస్పీ నేత నరేంద్ర సింగ్ అలియాస్ పింటూ 4గంటల ప్రాంతంలో విధాన్ భవన్ వద్దకు చేరుకున్నారు. ఆ తర్వాత అకస్మాత్తుగా ఒంటిపై ఆయిల్ పోసుకొని నిప్పటించుకోవడంతో మంటలు చెలరేగాయి. విషయాన్ని గమనించిన పోలీసులు మంటలు ఆర్పి, ఆసుప్రతికి తరలించారు. దాదాపు 40శాతం గాయాలయ్యాయని వైద్యులు తెలిపారు. ఆసుపత్రికి తరలించే సమయంలో బీజేపీ మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం బాధాకరమని ఆసుపత్రికి వెళ్లే మార్గంలో అరిచినట్లు పోలీసులు పేర్కొన్నారు.