తిరువనంతపురం, జూన్ 16: కేరళలో రెండు వారాల వ్యవధిలో సినీ పరిశ్రమకు చెందిన ముగ్గురు ప్రముఖలు బీజేపీకి గుడ్బై చెప్పారు. బీజేపీని ఇటీవల వీడినట్టు దర్శకుడు రామసింహన్ అబూబక్కర్ గురువారం ప్రకటించారు.
2021లో ఇస్లాంను వీడి హిందూ మతంలో చేరిన తర్వాత తన పేరును రామసింహన్గా మార్చుకున్న అలీ అక్బర్ కొంతకాలం రాష్ట్ర బీజేపీ కమిటీ సభ్యుడిగా పనిచేశారు. ‘(సనాతన) ధర్మంతో తప్ప మిగతా అన్నింటి నుంచి విముక్తి పొందాను’ అని ఆయన తన ఫేస్బుక్ పోస్ట్లో పేర్కొన్నారు. ఇటీవల సినీ దర్శకుడు రాజసేనన్, నటుడు భీమన్ రఘు కూడా కమలం పార్టీని వీడి సీపీఎం గూటికి చేరారు.