న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో 2020 ఫిబ్రవరిలో భారీ స్థాయిలో అల్లర్లు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఆ ఘటనపై నమోదు అయిన కేసులో ఇవాళ ఢిల్లీ కోర్టు తీర్పునిచ్చింది. అల్లర్ల కేసులో నిందితుడు దినేశ్ యాదవ్కు అయిదేళ్ల జైలుశిక్షను కోర్టు ఖరారు చేసింది. దినేశ్ యాదవ్ అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడి హింసకు దిగాడు. ఆ కేసులో గత నెలలోనే అతన్ని దోషిగా తేల్చారు. 73 ఏళ్ల మహిళ ఇంటికి నిప్పుపెట్టిన కేసులోనూ దినేశ్ను నిందితుడిగా ప్రకటించారు. అయితే ఇవాళ ఆ కేసులో తీర్పునిస్తూ.. దినేశ్కు అయిదేళ్ల శిక్ష విధించారు. 2020లో ఈశాన్య ఢిల్లీలో జరిగిన అల్లర్లలో సుమారు 50 మంది మృతిచెందగా, మరో 200 మంది గాయపడ్డారు. అల్లర్ల సృష్టించిన గ్యాంగ్లో దినేశ్ యాక్టివ్గా ఉన్నట్లు ప్రాసిక్యూషన్ వాదించింది. తన ఇంటిపై సుమారు 200 మంది దాడి చేసి నిప్పుపెట్టారని 73 ఏళ్ల మహిళ మనోరి కోర్టుకు తెలిపింది. ఫిబ్రవరి 25వ తేదీన ఈ ఘటన జరిగింది. ఇంట్లో ఉన్న విలువైన వస్తువుల్ని కూడా ఎత్తుకెళ్లినట్లు ఆమె ఆరోపించింది. ఇదే కేసులో నిన్న ఆరుగురికి ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరీ చేసింది. గోకుల్పురి ప్రాంతంలో ఓ షాపుకు నిప్పుపెట్టినట్లు నమోదు అయిన కేసులో వారికి బెయిల్ దొరికింది.