భోపాల్, ఏప్రిల్ 13: మధ్యప్రదేశ్ మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్సింగ్ చిక్కుల్లో పడ్డారు. శ్రీరామనవమి రోజున ఖార్గోన్ పట్టణంలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపై ఆయన ఫేక్ ఫొటో షేర్ చేశారన్న ఆరోపణలపై ఇప్పటికే పలు కేసులు నమోదయ్యాయి. ఆయనను అరెస్ట్ చేసేందుకు మధ్యప్రదేశ్లోని బీజేపీ సర్కారు సిద్ధమైంది. దిగ్విజయ్పై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు న్యాయ నిపుణులతో చర్చిస్తున్నామని, పోలీసులు త్వరలో ఆయన్ను అరెస్టు చేసే అవకాశం ఉందని హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా పేర్కొన్నారు.