న్యూఢిల్లీ: గూడ్స్ రైళ్లలో వస్తువుల చోరీని నియంత్రించడానికి ఓటీపీ ఆధారిత డిజిటల్ లాకింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ఈ వ్యవస్థ ద్వారా రైలులో వస్తువులను లోడ్ చేసి తాళం వేసి సీల్ చేసిన తర్వాత గమ్యం చేరే వరకు మళ్లీ తెరవడానికి కుదరదు. ఒకవేళ తెరవాలన్నా కచ్చితంగా ఓటీపీ ఉండాల్సిందే. వస్తువులు లోడ్ చేసి తాళం వేయగానే సంబంధిత అధికారి, డ్రైవర్ మొబైళ్లకు ఓటీపీ వెళ్తుంది. గమ్యం చేరిన తర్వాత ఇద్దరికి వచ్చిన ఓటీపీలను నమోదు చేస్తేనే తాళం తెరుచుకుంటుంది.