గువాహటి, జూలై 23: సాధారణ పౌరులు దొంగతనం జరిగితే పోలీసులను ఆశ్రయిస్తుంటారు. అయితే పోలీసులే దొంగతనానికి బాధితులైతే! ఇలాంటి పరిస్థితి అస్సాం ఉన్నతాధికారికి ఎదురైంది. లా అండ్ ఆర్డర్ డీఐజీ వివేక్రాజ్ సింగ్ ఫోన్ను బైక్పై వచ్చిన దుండగులు దొంగిలించారు. ఆదివారం ఉదయం ఆయన మార్నింగ్ వాక్ చేస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకొన్నది. ఆ సమయంలో వెనుక నుంచి వచ్చిన దొంగలు ఆయన ఫోన్ లాక్కొని పరారయ్యారు. గువాహటిలోని పోలీసు ప్రధాన కార్యాలయానికి సమీపంలో ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. చోరీపై దర్యాప్తు చేస్తున్నామని చెబుతున్న ఉన్నతాధికారులు.. మిగతా వివరాలు వెల్లడించేందుకు మాత్రం నిరాకరించారు.