ముంబై: మనీల్యాండరింగ్ కేసులో శివసేన నేత సంజయ్ రౌత్ మూడు నెలల పాటు జైలు శిక్ష అనుభవించిన విషయం తెలిసిందే. జైలులో ఉన్న సమయంలో 10 కిలోల బరువు తగ్గినట్లు రౌత్ తెలిపారు. ఓ మీడియా సంస్థతో ఆయన ఇవాళ మాట్లాడారు. గుడ్డు లాంటి సెల్లో వేశారని, దాని వల్ల 15 రోజుల పాటు సూర్య కిరణాల్ని చూడలేకపోయినట్లు ఆయన చెప్పారు. ఆ కారణంగా తనకు కంటి చూపు సమస్యలు వచ్చినట్లు రౌత్ వెల్లడించారు. ఒకవేళ తాను బీజేపీకి లొంగిపోయి ఉంటే అప్పుడు తనను అరెస్టు చేసేవారు కాదన్నారు.
తనను తాను యుద్ధ ఖైదీగా భావిస్తున్నట్లు రౌత్ తెలిపారు. ఎందుకంటే తాము ప్రభుత్వంతో పోరాడుతున్నట్లు చెప్పారు. జైలులో మహారాష్ట్ర హోంశాఖ మంత్రి అనిల్ దేశ్ముఖ్ను చూశానని, ఆయన ఆరోగ్యం క్షీణించిందని రౌత్ తెలిఆరు. కేవలం ప్రతిపక్షంలో ఉన్నవాళ్లను మాత్రమే ప్రభుత్వం అరెస్టు చేస్తుందా అని ఆయన ప్రశ్నించారు.