భువనేశ్వర్: బాలీవుడ్ హీరో హృతిక్రోషన్ నటించిన ధూమ్ (Dhoom) సినిమా చూసి ఇన్స్పైర్ అయ్యారో ఏమో ఆ దొంగలు.. స్కూల్లో చొరబడి కంప్యూటర్లు, ప్రిటర్లు ఎత్తుకుపోవడమే కాకుండా చేతనైతే మమ్మల్ని పట్టుకోండి అంటూ పోలీసులకు సవాల్ విసిరారు. అంతటితో ఆగకుండా కొన్ని ఫోన్ నంబర్లు కూడా బోర్డుపై రాసివెళ్లారు. సినీఫక్కీలో జరిగిన ఈ ఘటన ఒడిశాలోని నవరంగ్పూర్ జిల్లాలో ఓ స్కూల్లో చోటుచేసుకున్నది.
నవరంగ్పూర్ జిల్లాలోని ఖతీగూడ లో ఉన్న ఇంద్రావతి హై స్కూల్లో ఆదివారం రాత్రి దొంగలు పడ్డారు. ప్రధానోపాధ్యాయుడి గదిలో ఉన్న కంప్యూటర్లు, జీరాక్స్ మెషిన్లు, ప్రింటర్లు, ఫొటో కాపీయర్స్, వేయింగ్ మెషిన్లను ఎత్తుకెళ్లారు. అంతటితో ఆగకుండా మీకు చేతనైతే మమ్మల్ని పట్టుకోంటి అంటూ కొన్ని ఫోన్ నంబర్ల్ను ఓ తరగతి గదిలోని బోర్డుపై రాశారు. దాంతోపాటు ధూమ్ 4 తొందర్లో వస్తుందని రాసివెళ్లారు.
అయితే సోమవారం ఉదయం స్కూల్కి వచ్చిన ప్యూన్.. హెడ్మాస్టర్ రూమ్ డోర్ తెరిచి ఉండటాన్ని గమనించాడు. అందులో వస్తువులు మాయమైపోవడాన్ని గుర్తించి యాజమాన్యానికి తెలిపాడు. దీంతో స్కూల్ హెచ్ఎం సర్వేశ్వర్ బెహెరా పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.