న్యూఢిల్లీ: భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) బ్రాండ్ అంబాసిడర్గా క్రికెట్ దిగ్గజం ఎంఎస్ ధోనీ నియమితులయ్యారు. ఎస్బీఐ ఆదివారం ఈ విషయాన్ని వెల్లడించింది. బ్యాంకు మార్కెటింగ్, ప్రమోషనల్ కార్యక్రమాల్లో ధోనీ కీలకపాత్ర పోషించనున్నారని పేర్కొన్నది. ఒత్తిడి వేళలోనూ సంయమనం వహిస్తూ, చురుకుగా నిర్ణయాలు తీసుకోవడంలో ధోనీ సమర్థుడని తెలిపింది. కస్టమర్లతో, ఇతర భాగస్వాములతో ఎస్బీఐ అనుబంధం ఏర్పరచుకునే తీరు ధోనీ వ్యవహార శైలిలో కనిపిస్తుందని పేర్కొన్నది.