నాగ్పూర్, జూలై 6: బీజేపీలో అసంతృప్తి అగ్గి రాజుకొన్నట్టే కనిపిస్తున్నది. పార్టీ శ్రేణులు అధినాయకత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్టు తెలుస్తున్నది. అందుకు తాజాగా నాగ్పూర్లో చోటుచేసుకొన్న సంఘటనలే నిదర్శనం.
డిప్యూటీ సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ పదవీ బాధ్యతలు చేపట్టిన సందర్భంగా మంగళవారం ఆయన స్వస్థలం నాగ్పూర్లో పార్టీ కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. అయితే, నాగ్పూర్ వీధుల్లో ఏర్పాటు చేసిన పోస్టర్లు, ఫ్లెక్సీలు, హోర్డింగుల్లో ఎక్కడా కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఫొటో లేకపోవటం గమనార్హం. ఫడ్నవీస్కు సీఎం పీఠం దక్కకుండా చేసింది అమిత్ షానేనని అక్కడి బీజేపీ క్యాడర్ భావిస్తున్నది. అందుకే షా ఫొటో లేకుండా చేశారని సమాచారం.