న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అగ్నిపథ్ స్కీమ్ దేశ యువత, సైన్యానికి విధ్వంసకరమని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా విమర్శించారు. దేశాన్ని రక్షించే మన యువత, ఆర్మీని ఈ పథకం చంపేస్తున్నది ఆరోపించారు. సాయుధ దళాల్లో నాలుగేళ్ల కాంట్రాక్ట్ రిక్రూట్మెంట్ విధానమైన అగ్నిపథ్కు వ్యతిరేకంగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ‘సత్యాగ్రహ’ పేరుతో కాంగ్రెస్ పార్టీ ఆదివారం నిరసన కార్యక్రమం నిర్వహించింది. ప్రియాంకా గాంధీ వాద్రాతోపాటు పలువురు కాంగ్రెస్ పార్టీ నేతలు ఇందులో పాల్గొన్నారు. అగ్నిపథ్ను వెనక్కి తీసుకోవాలంటూ ఫ్ల కార్డులను ప్రదర్శించారు.
ఈ సందర్భంగా ప్రియాంక గాంధీ మాట్లాడారు. అగ్నిపథ్ పథకం దేశంలోని యువతను చంపేస్తుంది, ఆర్మీని అంతం చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వ ఉద్దేశాన్ని గమనించాలని, ప్రభుత్వాన్ని పడగొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. దేశానికి నిజమైన ప్రభుత్వం, దేశ ఆస్తులను కాపాడే ప్రభుత్వాన్ని తీసుకురావాలని కోరారు.
మరోవైపు నిరసనలను ఆపవద్దన్న ప్రియాంక గాంధీ, ప్రజాస్వామ్యంగా, శాంతియుతంగా కొనసాగించాలని యువతకు పిలుపునిచ్చారు. ‘సత్య మార్గంలో నడవడం ద్వారా ఈ ప్రభుత్వాన్ని పడగొట్టడమే మీ లక్ష్యం. నిజమైన దేశభక్తిని చాటే, దేశ వనరులను సురక్షితంగా ఉంచే, మన పేదలు, యువతను ముందుకు తీసుకెళ్లే ప్రభుత్వం కోసం మీరు కృషి చేయాలి’ అని అన్నారు. అగ్నిపథ్కు వ్యతిరేకంగా పోరాడుతున్న, నిరసన చేస్తున్న వారికి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త అండగా ఉంటారని భరోసా ఇచ్చారు.
This scheme will kill the youth of the country, will finish Army… Please see the intent of this govt and topple it. Bring a govt that is true to the nation, protects country's assets. I urge you to do peaceful protest but don't stop: Congress's Priyanka GV on Agnipath scheme pic.twitter.com/rNoYtlqLgK
— ANI (@ANI) June 19, 2022