కోల్కతా : రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసే ఆరుగురు అభ్యర్ధులతో కూడిన జాబితాను తృణమూల్ కాంగ్రెస్ (TMC) సోమవారం ప్రకటించింది. జులై 24న జరిగే ఎగువ సభ ఎన్నికల్లో డెరెక్ ఓబ్రెయిన్, సాఖేత్ గోఖలే, డోలా సేన్, సుఖేందు శేఖర్ రాయ్, సమిరుల్ ఇస్లాం, ప్రకాష్ చిక్ బరైక్ బరిలో ఉంటారని టీఎంసీ వెల్లడించింది. రాజ్యసభ ఎన్నికల్లో పార్టీ తరపున సీనియర్ నేతలు ఎన్నికల బరిలో దింపుతున్నామని టీఎంసీ ఓ ప్రకటనలో పేర్కొంది.
ప్రతి భారత పౌరుడి హక్కుల పరిరక్షణకు తృణమూల్ పోరాట వారసత్వాన్ని వారు అందిపుచ్చుకుంటారని పార్టీ తన ట్విట్టర్ ఖాతాలో తెలిపింది. రాజ్యసభ అభ్యర్ధులుగా పోటీ చేస్తున్న అభ్యర్ధులందరికీ శుభాకాంక్షలు తెలిపింది.
డెరెక్ ఓబ్రెయిన్, సుఖేందు శేఖర్ రాయ్, డోలా సేన్ల రాజ్యసభ పదవీకాలం ముగియనుండటంతో వారిని మరోసారి అభ్యర్ధులుగా పార్టీ తరపున బరిలో దింపాలని టీఎంసీ నిర్ణయించింది. గోవా, గుజరాత్, పశ్చిమ బెంగాల్లో పది రాజ్యసభ స్ధానాలకు జులై 24న ఎన్నికలు నిర్వహించాలని ఈసీ ప్రకటించిన సంగతి తెలిసిందే.
Read More :