బెంగళూరు: కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నదని ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం శివకుమార్ ఆరోపించారు. ‘మా ఎమ్మెల్యేలను ఎవరెవరు (బీజేపీ నాయకులు) కలిశారు.. ఏం ఆఫర్ ఇచ్చారు.. అన్నీ తెలుసు. ఆఫర్కు లొంగని మా ఎమ్మెల్యేలు తిరిగి నా దగ్గరకు వచ్చి జరిగిందంతా నాతో చెప్పారు. నేను వారితో ఒక్కటే చెప్పా.. ఈ ఆపరేషన్ కమల్ని అసెంబ్లీ సాక్షిగా బట్టబయలు చేయాలని సూచించా’ అని పేర్కొన్నారు. ఎమ్మెల్యేల మధ్య గ్రూపు తగాదాలు, తిరుగుబాటు వార్తల్ని శివకుమార్ కొట్టిపారేశారు. రాష్ట్ర మంత్రి, కేపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ సతీశ్ జక్రోలీ, తనకు మధ్య విభేదాలు ముదిరాయన్న వార్తల్లో నిజం లేదన్నారు.