న్యూఢిల్లీ, మే 22(నమస్తే తెలంగాణ): కర్ణాటకలో కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రితో సహా మంత్రులందరూ నేర చరిత్ర కలిగిన వారేనని ఏడీఆర్ (అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రీఫార్మ్స్) తాజా నివేదిక తేల్చింది. నలుగురు మంత్రులపై సీరియస్ క్రిమినల్ కేసులున్నాయని పేర్కొంది. మంత్రులంతా అత్యంత ధనవంతులేనని తెలిపింది. కోటీశ్వరుల జాబితాలో తొమ్మిది మంది మంత్రులు ఉన్నారు. 9 మంది మంత్రుల సగటు ఆస్తులు రూ.229.27 కోట్ల పైబడే ఉన్నాయి. అత్యధికంగా డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ రూ.1413.80 కోట్ల ఆస్తులు కలిగిన మంత్రిగా ఉన్నారు. అత్యల్ప ఆస్తులున్న మంత్రిగా చిత్తాపూర్ నియోజకవర్గానికి చెందిన ప్రియాంక్ ఖర్గే రూ.16.83 కోట్లతో జాబితాలో చివరన ఉన్నారు.