చండీగఢ్: కరోనా మహమ్మారి ప్రపంచదేశాలతోపాటు భారత్లోనూ ఉగ్రరూపం దాల్చింది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఈ మహమ్మారి ప్రమాద ఘంటికలు మోగిస్తున్నది. సామాన్యుల నుంచి సెలెబ్రిటీల వరకు ఎవ్వరినీ వదిలిపెట్టకుండా విలయతాండవం చేస్తున్నది. తాజాగా హర్యానా ఉపముఖ్యమంత్రి దుష్యంత్ చౌతలాకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ ఉదయం ఆయన కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోగా రిపోర్టుల్లో పాజిటివ్ వచ్చింది.
ఈ విషయాన్ని దుష్యంత్ చౌతలా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఇటీవల తనను కలిసిన వాళ్లంతా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని కోరారు. పాజిటివ్గా వచ్చినవాళ్లు సెల్ఫ్ ఐసోలేషన్లో ఉండాలని సూచించారు.