లౌడ్ స్పీకర్ల వ్యవహారం మహారాష్ట్రలో ఇప్పట్లో చల్లారేలా లేదు. మే 3 కల్లా లౌడ్స్పీకర్లను నిషేధిస్తూ ఉద్ధవ్ సర్కార్ నిర్ణయం తీసుకోవాలని మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన అధ్యక్షుడు రాజ్ థాకరే అల్టిమేటం జారీ చేశారు. ఈ అల్టిమేటంపై మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, ఎన్సీపీ నేత అజిత్ పవార్ స్పందించారు. రాజ్థాకరే అల్టిమేటాన్ని లైట్ తీసుకోండని ఎద్దేవా చేశారు. ఆ వ్యాఖ్యలకు అంత ప్రాముఖ్యత వుండదన్నారు. సరైన సమయం వచ్చినప్పుడు, ప్రభుత్వం పక్షాన తాను కచ్చితంగా సమాధానమిచ్చి తీరుతామని పర్కటించారు. రాజ్ థాకరే ప్రశ్నలకు జవాచ్చితీరుతామని అజిత్ పవార్ స్పష్టం చేశారు.
మరోవైపు….లౌడ్ స్పీకర్ల నిషేధంపై కాంగ్రెస్ నేత సంజయ్ నిరుపమ్ కూడా స్పందించారు. ముంబైలోని ఒక్క మసీదు నుంచైనా లౌడ్ స్పీకర్లను నిషేధిస్తే అది పెద్ద అవమానమే అవుతుందని ట్విట్టర్లో పేర్కొన్నారు. ఒక్క మసీదు నుంచైనా లౌడ్ స్పీకర్లను నిషేధిస్తే.. అది ప్రభుత్వానికి సిగ్గు చేటు. ఒకవేళ ప్రభుత్వం కాదని ముందుకు వెళితే, ప్రభుత్వాన్ని, పోలీసులను మేం నిషేధిస్తాం. ప్రభుత్వం గనక సౌండ్ విధి విధానాలపై మార్గదర్శకాలను విడుదల చేయాలి. అన్ని మసీదులూ దీన్ని అమలు చేసేలా చూసుకోవాలి అంటూ కాంగ్రెస్ నేత సంజయ్ నిరుపమ్ అన్నారు.