న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీని బుధవారం దట్టమైన పొగమంచు కప్పేసింది. దీంతో పలు విమాన, రైళ్ల సర్వీసులకు ఆటంకం ఏర్పడింది. పలు విమానాలు, రైళ్లను రద్దు చేయగా, మరికొన్ని ఆలస్యంగా నడుస్తున్నాయి. దట్టమైన పొగమంచు కారణంగా యూపీలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 8 మంది మృతి చెందగా, 30 మంది గాయపడ్డారు. బరేలీ జిల్లా హఫీజ్ గంజ్లో మోటారు సైకిల్ను ట్రాక్టర్ ఢీకొనగా ఇద్దరు మహిళలు, ప్రయాగ్ రాజ్ జిల్లాలో ఇద్దరు యువకులు, ఉన్నావ్లో రెండు బస్సులు ఢీకొని ఒకరు, మరో రెండు ప్రమాదాల్లో ముగ్గురు మృతి చెందారు.