న్యూఢిల్లీ: భారత్లో తయారైన మొట్టమొదటి డెంగ్యూ టీకా డెంగీఆల్ త్వరలో మార్కెట్లోకి రానుంది. సంబంధిత మూడో దశ క్లినికల్ ట్రయల్స్ దాదాపుగా పూర్తి కావొచ్చాయని సమాచారం. భారత వైద్య పరిశోధన మండలి, పనసియా బయోటెక్ 8 వేల మందితో 20 నగరాల్లో ఈ ట్ర యల్స్ నిర్వహిస్తున్నాయి.
ట్రయల్స్ కోసం 10,500 మంది తుది నమోదు అక్టోబర్ నాటికి పూర్తవుతుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ట్రయల్స్లో పాల్గొన్న వారిలో కొందరికి టీకా ఇవ్వగా కొందరికి ప్లాసిబో ఇచ్చారు. వీరిని రెండేండ్ల పాటు పరిశీలిస్తారు. ఇప్పటివరకు తొలి రెండు దశ ట్రయల్స్లో టీకా భద్రతపై ఎలా ంటి ఆందోళనలు వ్యక్తం కాలేదు.