లక్నో, అక్టోబర్ 20: ఉత్తరప్రదేశ్లో ఓ బ్లడ్బ్యాంకు నిర్వాకం ఒక రోగి ప్రాణాలు తీసింది. ప్లాస్మాకు బదులు బత్తాయి రసం సైప్లె చేయటంతో.. అది ఎక్కించిన రోగి మృతి చెందాడు. ఈ ఘటన ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ సొంత ఇలాఖా అయిన ప్రయాగ్రాజ్లోనే వెలుగుచూడటం కలకలం రేపుతున్నది. ప్రయాగ్రాజ్లోని ఝల్వా ప్రాంతంలో ఉన్న గ్లోబల్ దవాఖానలో ఇటీవల ఓ వ్యక్తి డెంగ్యూతో చేరాడు. అతడికి ప్లాస్మా ఎక్కించాలని వైద్యులు చెప్పటంతో సమీపంలోని బ్లడ్ బ్యాంకును ప్లాస్మా కోసం సంప్రదించారు.
బ్లడ్బ్యాంకు సిబ్బంది ప్లాస్మా బ్యాగ్లో బత్తాయి రసం నింపి ఇవ్వటంతో వైద్యులు దానిని పరిశీలించకుండానే రోగికి ఎక్కించారు. దాంతో రోగి మరణించాడు. ఈ దారుణాన్ని గుర్తించిన రోగి బంధువు ఒకరు బత్తాయి రసం ఉన్న బ్లడ్ బ్యాగును చూపుతూ ఓ వీడియో తీసి ట్విట్టర్లో పోస్ట్ చేయటంతో కలకలం రేగింది. దీనిపై ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించినట్టు పోలీస్ అధికారి రాకేశ్సింగ్ తెలిపారు.