Joshimath | ఉత్తరాఖండ్లోని ప్రముఖ ఆధ్యాత్మిక ప్రాంతం జోషీమఠ్లో కూల్చివేత పనులకు తాత్కాలిక బ్రేక్ పడింది. ప్రస్తుతం ఆ ప్రాంతంలో భారీగా మంచు కురుస్తోంది. దీనికి తోడు వర్షం పడుతుండటంతో కూల్చివేత పనులను తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయని చమోలి జిల్లా మెజిస్ట్రేట్ హిమాన్షు ఖురానా (Himanshu Khurana) తెలిపారు. దీంతో పనులను తాత్కాలికంగా నిలిపివేసినట్లు పేర్కొన్నారు. పరిస్థితి మెరుగుపడిన తర్వాత పనులు తిరిగి ప్రారంభించనున్నట్లు ఆయన వెల్లడించారు.
ఇప్పటికే ప్రమాదపుటంచున ఉన్న ఆధ్యాత్మిక కేంద్రంలో భారీగా హిమం పేరుకుపోతోంది. మరోవైపు వర్షం కూడా కురుస్తోంది. దీంతో స్థానికులు, అధికారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మరో వారం రోజుల పాటు వాతావరణం ఇదే విధంగా ఉంటుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 23 నుంచి 27 వరకు భారీ హిమపాతంతోపాటు, వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.
మంచు పర్వతాలతో కూడిన సుందర తలమైన జోషీమఠ్ అనేక మందికి పవిత్రమైన దైవభూమి. కానీ అభివృద్ధి, మౌలిక వసతుల పేరిట చేపట్టిన విచక్షణ లేని అశాస్త్రీయ నిర్మాణాల వల్ల మొత్తం ఆ ప్రాంత ఉనికికే ప్రమాదం ఏర్పడుతున్నది. గతకొంతకాలంగా చేపడుతున్న పలు ప్రాజెక్టులతో పట్టణం కుంగిపోతున్నది. ఏటా 10 సెంటీమీటర్లు మేర అక్కడ భూమి కుంగిపోతున్నట్లు తాజా అధ్యయనంలో వెల్లడైంది. అక్కడ నివసిస్తున్న ప్రజలను అధికారులు ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ప్రమాదకరంగా ఉన్న భవనాల కూల్చివేత ప్రక్రియను అధికారులు ఇటీవలే చేపట్టారు.
#WATCH | Joshimath in Uttarakhand receives heavy snowfall pic.twitter.com/T9h5a3jdjL
— ANI (@ANI) January 20, 2023
Uttarakhand| Because of the heavy snowfall & rain, the labourers are unable to work, so the demolition work going on in Joshimath has been stopped. Will resume the work once the situation improves: Himanshu Khurana, Chamoli DM pic.twitter.com/QS42MOhnmM
— ANI UP/Uttarakhand (@ANINewsUP) January 20, 2023